జనం న్యూస్ మే 1 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో రెడ్డిగూడెం గ్రామంలో ఆశి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు సిరికొండ రామారావు మాట్లాడుతూ ప్రాజెక్టు తెగిపోయి రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వాలు పూర్తి చేస్తామని చెబుతున్నారు తప్ప ప్రాజెక్టును నిర్మించడం లేదని దీనివల్ల సుమారుగా 16 ఎకరాల భూమి పంటలు పండక రైతాంగం త్రీవ నష్టా పోతున్నారని వారన్నారు. అలాగే మీ 11 12 13 తేదీల్లో ఇల్లందులో జరిగే అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభకు అనేక రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొంటారని రైతాంగం గిట్టుబాటు ధరలు వ్యవసాయ రంగం ఎదుర్కొనే సమస్యలు పై పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు రైతు సంఘం జాతీయ కార్యదర్శికి చిల రంగారెడ్డి గుమ్మడి నరసయ్య తదితరులు పాల్గొంటారని ఈ సభకు అందరూ హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం గ్రామస్తులు ఆసి నారాయణ మీడియం మల్లేష్ ఓకే కన్నయ్య చోడే యేసు తుర్రం చంద్రమ్మ రాజులు ఊకే బుల్లెమ్మ ఓకే సీతమ్మ అగరం అప్పారావు కట్ట వెంకయ్య కట్టం దేవి కట్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు.