అత్యున్నత ఫలితాలతో బోధన్ ఇందూర్” హైస్కూల్,

*విద్యార్థిని సన్మానించి అభినందించి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి….

జనం న్యూస్ బోధన్ నియోజకవర్గం ఏప్రిల్ 30, ​10వ తరగతి ఫలితాలలో బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. అత్యుత్తమ మార్కులు సాధించి, తమ సత్తాను చాటి చెప్పారు.​ టాప్ స్కోరర్లు ​రాంచరణ్ 583 మార్కులతో ప్రథమ స్థానం.​వి హర్షవర్ధన్: 573 ,​బి . గణేష్ కుమార్: 571 ,​బి శ్రీరామ్: 569 ,​దీపిక: 568 ​సాక్షి: 567 ,​యం . వైష్ణవి: 566 ​కే . సహస్ర, డి . నిఖిల్: 564 ​550 కంటే ఎక్కువ మార్కులు: 21 మంది​540 కంటే ఎక్కువ మార్కులు: 37 మంది​500 కంటే ఎక్కువ మార్కులు: 113 మంది​సబ్జెక్టుల వారీగా A1 గ్రేడ్ (10/10) సాధించిన వారు:​తెలుగు: 68 మంది​హిందీ: 49 మంది​ఇంగ్లీషు: 50మంది​గణితం: 55 మంది​సైన్స్: 40 మంది ​సాంఘిక శాస్త్రం: 71 మంది​అదేవిధంగా 95 మార్కులకు పైగా తెలుగులో 37 మంది, హిందీలో 19 మంది, ఇంగ్లీషులో 13 మంది, గణితంలో 24 మంది, సోషల్ లో 30 మంది సాధించారు. తమ విద్యార్థుల కృషి, పట్టుదల ఈ విజయానికి కారణమని సంస్థ కరస్పాండెంట్ కొడాలి కిశోర్ పేర్కొన్నారు. అనంతరం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విద్యార్థులను అభినందించారు .తమ ఉపాధ్యాయ బృందం అపారమైన అనుభవంతో, అత్యంత తీరిక లేని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో అత్యుత్తమమైన మార్కులను సాధించడం సాధ్యమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విజయం సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని, తల్లిదండ్రులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *