జనం న్యూస్ టేక్మాల్ 01 05 2026, మరో ప్రపంచం వైపు అడుగులు.. మహాకవి శ్రీశ్రీకి అక్షర నివాళి!
తెలుగు సాహితీ గగనంలో విప్లవ కేతనం ఎగురవేసిన మహాకవి, అభ్యుదయ యుగకర్త శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) 116వ జయంతిని నేడు జిల్లావ్యాప్తంగా సాహితీప్రియులు, కార్మిక సంఘాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్యం సమాజంపై చూపిన ప్రభావాన్ని స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. తెలుగు సాహిత్యాన్ని ‘శ్రీశ్రీకి పూర్వం – శ్రీశ్రీకి తదనంతరం’ అని విభజించాల్సి రావడం ఆయన సృజించిన అక్షర ప్రభంజనానికి నిదర్శనం. నేడు ఆ మహాకవి 116వ జయంతి. అక్షరానికి అగ్ని సంస్కారం చేసిన విప్లవ యోధుడు, సామాన్యుడి ఆర్తనాదాన్ని కావ్య వస్తువుగా మార్చిన యుగకర్త శ్రీశ్రీని స్మరించుకోవడం అంటే.. మారుతున్న కాలంలో మసకబారుతున్న సామాజిక స్పృహను మళ్ళీ వెలిగించుకోవడమే.సాహిత్యం అంటే కేవలం రాజాస్థానాల పొగడ్తలు, శృంగార వర్ణనలు మాత్రమే అనుకుంటున్న రోజుల్లో.. “కాదేదీ కవితకనర్హం” అని చాటిచెప్పిన ధీశాలి ఆయన. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ.. వేటినైనా కవితా వస్తువుగా మార్చి, వాటి వెనుక ఉన్న శ్రమను, వేదనను ప్రపంచానికి పరిచయం చేశారు. ‘మహాప్రస్థానం’ కేవలం ఒక పుస్తకం కాదు; అది దోపిడీకి గురవుతున్న ప్రతి గుండె నుంచి వెలువడిన నిరసన గళం.ఛందస్సుల సంకెళ్లను తెంచి, వాడుక భాషలో కవిత్వం రాసి, అక్షరాన్ని ప్రజల ముంగిటకు తెచ్చారు. “నేనొక దుర్గం, నాదొక స్వర్గం” అని ఆయన అన్నప్పుడు, అది అహంకారం కాదు, ఒక కవికి తన కలంపై ఉన్న అచంచలమైన ఆత్మవిశ్వాసం. సినిమా పాటల్లో సైతం విప్లవ భావాలను చొప్పించి, “తెలుగు వీర లేవరా” అంటూ నిద్రపోతున్న జాతిని మేల్కొల్పిన ఘనత ఆయనది.నేడు సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అసమానతలు, అశాంతి రాజ్యమేలుతున్న తరుణంలో శ్రీశ్రీ కవిత్వం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. “వ్యక్తికి బహువచనం శక్తి” అని ఆయన ఇచ్చిన పిలుపు, ఐక్యమత్యంతో సాధించలేనిది ఏదీ లేదని నేటి తరానికి గుర్తు చేస్తూనే ఉంటుంది.శ్రీశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన రాసిన ప్రతి అక్షరం ఒక అగ్నికణమై నిరంతరం ప్రజ్వలిస్తూనే ఉంటుంది. అభ్యుదయ పథంలో నడవాలనుకునే ప్రతి ఒక్కరికీ శ్రీశ్రీ ఒక నిరంతర స్ఫూర్తి ప్రదాత. తెలుగు సాహితీ గగనంలో విప్లవ కేతనం ఎగురవేసిన మహాకవి, అభ్యుదయ యుగకర్త శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) 116వ జయంతిని నేడు జిల్లావ్యాప్తంగా సాహితీప్రియులు, కార్మిక సంఘాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్యం సమాజంపై చూపిన ప్రభావాన్ని స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు ఆయనకు నివాళుల ర్పించారు. సాహిత్యం అంటే కేవలం రాచరికపు వైభోగాలు, శృంగార వర్ణనలు మాత్రమే కాదని.. సామాన్యుడి ఆకలి, కష్టజీవి చెమట చుక్క కూడా కవిత్వానికి వస్తువులేనని నిరూపించిన యుగకర్త శ్రీశ్రీ. ఆయన రచించిన ‘మహాప్రస్థానం’ తెలుగు కవిత్వ చరిత్రలో ఒక మైలురాయి. సమాజంలోని అసమానతలపై ఆయన సంధించిన అక్షర అస్త్రాలు నేటికీ ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తూనే ఉన్నాయి.కేవలం గ్రంథాలకే పరిమితం కాకుండా, వెండితెరపై కూడా తనదైన ముద్ర వేశారు శ్రీశ్రీ. విప్లవ గీతాల నుంచి మనసును హత్తుకునే భావుకత వరకు ఆయన కలం పలికించని భావం లేదు. “తెలుగు వీర లేరా..”, “ఆకశం నీ హద్దురా..” వంటి ఎన్నో స్ఫూర్తిదాయక గీతాలు నేటికీ అజరామరంగా నిలిచిపోయాయి.
