సాక్షి డిజిటల్ న్యూస్ మరికల్ ,మార్చు 15, 2026,( రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని ప్రతి మండల కేంద్రాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను నిర్వహించింది శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు మరికల్ ధన్వాడ ఊట్కూర్ మక్తల్ దామరగిద్ద మగనూరు విద మండలాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇటు పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాట్లను నిర్వహించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు పరిశీలించడం జరిగింది. మొదటిరోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
