ముదిరాజులను ఆదుకోవాలి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సబ్బని శ్రీనివాస్

సాక్షి డిజిటల్ న్యూస్ (కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ నేమూరి కరుణాకర్ మెట్ పల్లి) మార్చ్ 15 2026. ముత్యంపేట గ్రామం లో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సబ్బని శ్రీనివాస్ ముదిరాజులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముదిరాజ్ లు వృద్ధిలోకి రావడానికి, సమాజంలో స్వావలంబి జీవితం సాగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా సూచనలు చేశారు. అధ్యక్షుడు శ్రీనివాస్ ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, స్వయం సహాయ కార్యక్రమాలు, ఆరోగ్య రక్షణ, వైద్య సౌకర్యాలు, యువతకు విద్యా, నైపుణ్య అవకాశాలు వంటి అంశాలను సూచించారు. ముదిరాజులు అనుభవజ్ఞులు, సమాజానికి మార్గదర్శకులు. వారికి సన్మానం, అవసరమైన సహాయం అందించడం మన బాధ్యత” అని ఆయన చెప్పారు. సమాజంలోని ప్రతి వ్యక్తి, సంఘం ఈ సూచనలను పాటించి ముదిరాజుల అభివృద్ధికి తోడ్పడాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *