సాక్షి డిజిటల్ న్యూస్: చక్రాయపేట, మార్చి 3 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) వైయస్సార్ కడప జిల్లా, చక్రాయపేట మండలం, మారెళ్ళ మడక గ్రామంలో ఉండే గండి వీరాంజనేయ స్వామి క్షేత్రంలో, సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా03-03-2026 వతేది ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం రోజున స్వామివారి ఆలయం మూసి యబడును.ఉదయం 9:30 నిమిషాలకు దర్శనం నిలిపివేస్తామని ఈ ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్ తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు కేసరిస్వామి మాట్లాడుతూ ఈ గ్రహణం కండగ్రస్త్ర చంద్రగ్రహణం అని ఈగ్రహణం భారతదేశం అంతట కనిపిస్తుందని అంతేకాకుండా ఈ గ్రహణం వేళలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బయట తిరగకుండా ఇంటి లోపలనే ఉండవలెనుఅని సింహ రాశి వారు ఈ చంద్రగ్రహణం చూడరాదని పగలు11:00లోపు ఆహారం తినవలెను. తర్వాత సాయంత్రం 7 గంటల తర్వాత ఆహారము వండి భుజించాలని తెలిపారు. అలాగే 4. 3.2026 ప్రాతః కాలంలో ఉదయం పుణ్యా వచనం పంచామృత అభిషేకం. ఆరాధన,నివేదన, అలంకరణ, తదుపరి 7 గంటలకు ఉదయం సర్వ దర్శనం ప్రారంభం అవుతుందని తెలిపారు. గ్రహణ అనంతరం మరుసటి రోజు యథావిధిగా పూర్వఫల్గుణి నక్షత్రం వారు సింహరాశి వారు పాలు, బియ్యం, వెండి నాగపడిగ, చంద్రబింబం దక్షిణ సహితంగా దానంచేసి గ్రహణ శాంతి చేసుకోవలెను అని మాట్లాడారు.