సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) పదరా మండలం రాయలగండిలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలు మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 21వ తేదీ నుంచి 25 వరకు అంగరంగవైభవంగా జరగనున్నాయి ఈమేరకు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు సానుకూలంగా స్పందించిన గోరటి వెంకన్న ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతా అన్నారని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంద మల్లిఖార్జున్, ఎనుపోతుల అనిల్, గడదాసు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.