వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నుండి బీఆర్ఎస్ లో చేరిక

*పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 03, రిపోర్టర్ నిచ్చామొల్ల రాజేశ్వర్, ,నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణం నాలుగో వార్డు కు చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు సురేందర్ తోపారం సోమవారం రోజున బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి సురేందర్ తోపారం కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. భీంగల్ పట్టణం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయని, భవిష్యత్తులో మరింత బలంగా ప్రజల కోసం పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *