జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు గురుకుల విద్యార్థి ఎంపిక……

సాక్షి డిజిటల్ న్యూస్, 28 జనవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్ : నారాయణపేట జిల్లాలో ఈ నెల 18, 19, 20 తేదీలలో నిర్వహించిన 35వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ అండర్14 బాలుర ఖో-ఖో పోటీలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, సుల్తానాబాద్‌కు చెందిన విద్యార్థి ఎం మల్లేష్ అద్భుత ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికయ్యాడు. ఈ ఎంపికతో అతడు తెలంగాణ రాష్ట్ర ఖో-ఖో జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.కృష్ణమాచార్య,
వైస్ ప్రిన్సిపల్ కే.కోటి, పి.రాజ్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ పీడీ డి ప్రసాద్, పీఈటీ సురేందర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. జాతీయస్థాయి ఖో-ఖో పోటీలు ఈ నెల 27, 28, 29, 30 తేదీలలో హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరగనున్నట్లు తెలిపారు. ఈ ఘనత సాధించిన విద్యార్థిని పెద్దపల్లి జిల్లా పీఈటీ అధ్యక్షులు వి.సురేందర్ కార్యదర్శి డీ.రమేష్, సుల్తానాబాద్ పీఈటీ కార్యదర్శి ప్రణయ్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, అంతర్జాతీయ ఖో-ఖో క్రీడాకారుడు గెల్లు మధుకర్ యాదవ్, పెద్దపల్లి జిల్లా ఖో-ఖో సంఘం కార్యదర్శి వేల్పుల కుమార్, అధ్యక్షుడు లక్ష్మణ్, కోశాధికారి ఈ.నరేష్లతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థి జాతీయస్థాయిలో సత్తా చాటుకుని రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *