2 వ బహుమతిగా ఉరుకుంద దేవస్థానం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 కర్నూలు జిల్లా కౌతళం మండలం, కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు కర్నూల్ నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లలో చేపట్టిన శకటాల ప్రదర్శనలో శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానానికి రెండో బహుమతి వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ… కలెక్టర్ డాక్టర్ సిరి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. దేవాలయ పర్యవేక్షకులు వెంకటేష్, ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి, ఉప ప్రధాన అర్చకులు మహా దేవ స్వామి, నాగరాజు స్వామి, ఈరన్న స్వామి,
మల్లయ్య స్వామి, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *