77గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మరిపెడ మండల ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ మరిపెడ రిపోర్టర్ ఇస్లావతు హేమ మరిపెడ మండల ప్రజా పరిషత్ వేణుగోపాల్ రెడ్డి ఎంపీడీవో అధ్వర్యంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరఆ జాతీయ జెండాకు వందనం చేశారు. అంతకుముందు గాంధీజీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, ప్రజలే పరిపాలించుకునే సమాఖ్య స్ఫూర్తితో దృఢ విశిష్టమైన రాజ్యాంగం మనదని అన్నారు.ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం మనందరికి గర్వకారణమని అన్నారు. అనంతరం ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ సోమ్లా నాయక్ ఏ ఓ వీరా సింగ్ ఈసీ నెహ్రూ ఆపరేటర్లు మండల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *