శ్రీవాణి డిగ్రీ-పీజీ కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

సాక్షి డిజిటల్ న్యూస్, 25 జనవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్ : శ్రీవాణి డిగ్రీ-పీజీ కళాశాల, సుల్తానాబాద్ లో ఘనంగా యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని విద్యార్థినులు, అధ్యాపకుల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ మాట్లాడుతూ “బాలికల విద్య – సమాజ భవిష్యత్”, “బాలిక సాధికారత – దేశాభివృద్ధి” అనే అంశాలపై అవగాహన కల్పించారు. బాలికల విద్య ప్రాముఖ్యత, హక్కులు, భద్రత, ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై ప్రసంగాలు నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలసాని శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాలికలను చదివిద్దాం – సమాజాన్ని ముందుకు నడిపిద్దాం అనే సందేశంతో ఈ కార్యక్రమం ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *