మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

*పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 నల్గొండ జిల్లా చిట్యాల మండలం, చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పలు వార్డులలో ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలతో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమావేశాలు నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారికి భరోసా మనోధైర్యాన్ని ఇస్తున్నారు. ప్రతి వార్డులో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *