సాక్షి డిజిటల్ న్యూస్, 20 జనవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని నీరుకుల్లా – వెగురుపల్లి గ్రామాల పరిధిలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం వద్ద జరుగు శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర మరో మేడారం జాతర గా ప్రసిద్ధి గాంచింది. ఈ జాతర చైర్మన్ గా నీరుకుల్లా గ్రామానికి చెందిన పొన్నం చంద్రయ్య గౌడ్ నియామకమైనట్లు సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నియామక పత్రాన్ని అందజేశారు. జాతర కమిటీ సభ్యులుగా నేరెళ్ల రాజయ్య, అడ్డగుంట శ్రీనివాస్, కోమల ప్రశాంత్, సిరిసిల్ల కళావతి లు నియామకమయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ గా నియామకమైన పోన్నం చంద్రయ్య గౌడ్, సభ్యులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 28, 29, 30 తేదీలలో మూడు రోజులపాటు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు వైభవంగా జరుగుతాయి. జాతరలో పాల్గొనే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని చైర్మన్ పోన్నం చంద్రయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు తెలిపారు.