ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరైన వీధి లైట్ల పంపిణీ

* కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి 2026 మునుగోడు రిపోర్టర్ సునీల్ సులేమాన్: మునుగోడు పట్టణానికి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులు 3 లక్షల రూపాయలతో మంజూరైన వీధి లైటులను స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈరోజు పట్టణ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వివిధ వార్డులలో వీధి లైట్లను ఏర్పాటు చేయమని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బీనపల్లి సైదులు, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి, మాజీ సర్పంచులు మిరియాల వెంకన్న, పందుల నరసింహ, మాజీ ఎంపీటీసీలు, పందుల భాస్కర్, జుట్టగోనీ యాదయ్య,పాల్వాయి జితేందర్ రెడ్డి, సాగర్ల లింగస్వామి, ఎండి అన్వర్, వార్డు సభ్యులు పందుల ప్రియాంక లింగస్వామి, యసరాని దినేష్, పందుల గంగాధర్, బీసం గంగరాజు, యరాసాని సైదులు, దుబ్బ రవి,కాట వెంకన్న, జిట్టగోనీ సైదులు, దుబ్బ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *