సాక్షి డిజిటల్ న్యూస్ 19 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, జగిత్యాల కు చెందిన నవనీత్, సాయి, ధరూర్ కు చెందిన సృజన్ సంక్రాంతి సెలవుల కోసం జగిత్యాలకు వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఫ్రెండ్స్తో కలిసి రూరల్ మండలం పోరండ్ల వద్ద పార్టీ చేసుకుని కారు లో తిరిగి వస్తుండగా, మద్యం మత్తులో అతివేగంగా వెళ్తున్న వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని,అనంతరం డివైడర్ను ఢీకొని బోల్తా పడ్డ కారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ముగ్గురు యువకుల్లో నవనీత్, సాయి తేజ ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా, సృజన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.