మూగజీవాలకు ఆహార కొరత గొర్రె మేక పెంపుడు జంతువులకు

*కవ్వాల్ అభయారణ్యం జన్నారం మండలంలో అభివృద్ధికి ఆటంకమే

సాక్షి డిజిటల్ న్యూస్.3.2026. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా పశు సంపదను పెంపొందిస్తూ మూగజీవాలైన గొర్రె. మేక గేదెలు ఆవులు పశు సంపద పోషణలో వందలాది సంవత్సరాలుగా జన్నారం మండలంలో వేలాది కుటుంబాలు కులవృత్తిగా జీవిస్తున్నప్పటికీ అనేక మంది నిరుద్యోగులు ఉపాధి కోసం పశుసంపదను సాంప్రదాయ కుటుంబ వనరులుగా గుర్తించి ప్రస్తుతం జీవనం కొనసాగిస్తున్న తరుణంలో కవ్వాల్ అభయారణ్యం టైగర్ జోన్ తో ఇబ్బందులు పడుతూ మేత మేయడానికి కూతవేటు దూరంలో పచ్చిక బయలు చిట్టడవులు అడవి ఉన్నప్పటికీ ఆంక్షలతో పులి రాకకు స్వాగతం అంటూ గ్రామాల్లోని చేళ్లలో పొలాల్లో మూగజీవాలు సంచరిస్తూ ప్రస్తుతం వర్షాకాలంలో పంటలు వేయడం పూర్తి కావడం రెండో పంటగా పంటలు వేయడంతో మేతకు ఇబ్బంది కలిగి రోడ్ల వెంట ఆహారాన్ని తినడం కోసం ప్రస్తుత తరుణంలో పరిస్థితి ఉంది అని పలువురు గొర్రెల కాపర్లు తెలిపారు మైదాన ప్రాంతాలైన గ్రామ రెవెన్యూ భూములను పశుగ్రాసం గుర్తించాలి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *