అదుపుతప్పి కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా

*గాయాల పాలైన 60 మంది విద్యార్థులు

సాక్షి డిజిటల్ న్యూస్, 3 జనవరి 2026, బూర్గంపాడు మండలం/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ రాయల నవీన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట అటవీ ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్వంచలోని కేఎల్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయం బస్సులో సుమారు 60 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నారు అనే సమాచారం. బస్సులో గల 60 మంది విద్యార్థిని విద్యార్థులు గాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం కాగా, ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి కేఎల్ఆర్ కళాశాల యాజమాన్యం చేరుకోవడంలో ఆలస్యం ఇది కళాశాల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనగా కనబడుతుంది అంటున్న స్థానికులు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఎంతో శ్రద్ధ పాటించా ల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం సబబు కాదని స్థానికులు అంటున్నారు. తీవ్ర గాయాల పాలైన విద్యార్థులను విద్యార్థులకు స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రులకు ఇతర వాహనాల్లో తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది .సమాచారం అందిన వెంటనే స్థానిక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మరియు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *