సాక్షి డిజిటల్ న్యూస్, ప్రతినిధి దాసరి శ్రీనివాస్, నవంబర్ 7/25, బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు గురువారం రోజు విద్యా పర్యటనలో భాగంగా శాంతిఘని మైన్ ను సందర్శించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్, ఘని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, సేఫ్టీ ఆఫీసర్ రాజు వర్యవేక్షణలో విద్యార్థులకు బొగ్గు ఘనుల ప్రాంతంలో బొగ్గు తవ్వకాల ప్రక్రియ, యంత్రాల వినియోగం, భూగర్భ గనుల నిర్మాణం, కార్మికుల భద్రతా చర్యల గురించి ప్రత్యక్షంగా వివరించారు. అలాగే గనుల అధికారులు విద్యార్థులకు బొగ్గు తవ్వక విధానం, విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ చర్యలు, మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ యొక్క సేవా కార్యక్రమాల గురించి విశాదంగా వివరించారు. ఇలాంటి విద్యా పర్యటనలు విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశీలనా దృష్టి, మరియు సామాజిక బాధ్యతాభావం పెంపొందించడంలో ఎంతో దోహదపడతాయి అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విలువైన అనుభవాన్ని పొందారు. ఈ పర్యటనకు సహకరించిన ప్రాజెక్ట్ ఆఫీస్, మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్, అధికారులకు పాఠశాల తరుపున డైరెక్టర్ ఈ. రవి ప్రసాద్, ప్రిన్సిపాల్ రాజ రమేష్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ జేసిన పాఠశాల యాజమాన్యం