సాక్షి డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా.15/3/2026 పరకాల నియోజకవర్గం సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మడికొండ పవన్ కుమార్, పరకాల మండలం మలకపేట గ్రామంలో ఆర్ఎంపి అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పైడిపాల వెంకటేశ్వర్లు చిన్ననాటి మిత్రుడైన చెరుపెల్లి శంకర్ తల్లి చెరిపెల్లి ఐలమ్మ కొద్ది రోజుల క్రితం మృతి చెందిన సందర్భంగా వారిని కలిసి పరామర్శించే వారి ఇంటి అవసరం నిమిత్తం 25 కిలోల బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది చెరుపల్లి శంకర్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపి ఓదార్చిన ఆర్.ఎం.పి అండ్ పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ పరకాల మండల అధ్యక్షులు దొమ్మటి బాబురావు అధ్యక్షులు గందె శ్రీనివాస్ కోశాధికారి ఎండి యాకూబ్ మరియు మలకపేట గ్రామ నివాసి తిక్క సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెరుపెల్లి శంకర్ కుటుంబాన్ని ఓదార్చి సంతాపం తెలియజేశారు…