వ్యవసాయ మహిళా కూలీలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

సాక్షి డిజిటల్ మార్చ్ 14/3 2026 అచ్చంపేట రూరల్ ( రిపోర్టర్ కాలురి మల్లేష్ ) అమ్రాబాద్ మండలం ఉప్పునుంతల గ్రామంలోని రోడ్డు మార్గాన వెళ్తున్న వ్యవసాయ మహిళా కూలీలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకొని ప్రజా ప్రభుత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు 500 ఉచిత సిలిండర్ పథకం, ఈ ప్రభుత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని రైతులకు ,మహిళలకు, వ్యవసాయానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహిళలకు వివరించడం జరిగింది, మహిళలు ఎమ్మెల్యే ఆరోగ్య యోగక్షణాలు తెలుసుకొని ప్రజా క్షేత్రంలో ప్రజల సమస్యలు తెలుసుకొని నిరంతరం పనిచేయాలని పట్టింపు ఉత్సాహంగా పనిచేయాలని వ్యవసాయ కూలీలు ఎమ్మెల్యే నుకోరడం జరిగింది. వ్యవసాయ మహిళా కూలీలను ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మహిళలను కోరిన. టిపిసిసి ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, వ్యవసాయ మహిళ కూలీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *