సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 14, మణుగూరు/భద్రాద్రికొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న : మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాణదాత ఉచితంబులెన్స్ ఈరోజు మరొకరికి ఆపదలో అండగా నిలిచింది. ప్రాణదాత ఉచిత అంబులెన్స్ ద్వారా అత్యవసర పొజిషన్లో ఉన్న నిరుపేద పేషెంట్ బి. అభిరామ్ 6 సంవత్సరాలు మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ గ్రామస్తులు పిడ్స్ రావడంతో పరిస్థితి విష మించడం. వలన డాక్టర్ సలహా మేరకు మణుగూరు సంజీవని పిల్లల హాస్పటల్ నుండి ఖమ్మం అంకుర హాస్పిటల్ కి తీసుకొని వెళ్లడం జరిగింది. మీ కష్టంలో “ప్రాణదాత” అంబులెన్స్ అండగా ఉంటుంది.Tollfree-1800-891-1465 ఈరోజు వరకు ప్రాణదాత అంబులెన్స్ 435 మందిని సురక్షితంగా ఉచితంగా హాస్పిటల్లో చేర్చడం జరిగిందని తెలుపుటకు సంతోషిస్తున్నాము.