పోలీస్ విధులకు ఆటంకం… వ్యక్తిపై కేసు నమోదు

సాక్షి డిజిటల్ న్యూస్.మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట. మార్చి 14(మాసాయిపేట లక్ష్మన్ ):- పోలీసుల విధులకు ఆటకం కల్పించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన చిన్న శంకరంపేట లో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన గైనకాడి అశోక్, సుశీల భార్యాభర్తలకు ఇదే గ్రామానికి చెందిన గైనకాడి శ్రీను తో గొడవ జరగగా, స్వల్ప గాయాలు అయినట్లు పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులను ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి చూపించుకోవాలని పంపించినట్లు ఏఎస్ఐ తెలిపారు. కొద్దిసేపటి తర్వాత గైనికాడి శ్రీను పోలీస్ స్టేషన్ కు వచ్చి తనపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తే తను పోలీస్ స్టేషన్ లోనే పురుగుల మందు తాగి చనిపోతారని విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ విట్టల్ బెదిరింపులకు తోపాటు విధులకు ఆటంకం కల్పించినందుకు, సెక్షన్ 226 ప్రకారం ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులకు తనకు అనుకూలంగా పనిచేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని భయభ్రాంతులకు గురి చేసినందున కేసు నమోదు చేసినట్లు తెలిపారు.