ఘనంగా టీటీడీ పాలకమండలి సభ్యుని జన్మదిన వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్, వేంపల్లి, మార్చి :14( పులివెందుల తాలూకారిపోర్టర్ గోసల ఆంజనేయులు) యాంకర్ వాయిస్… వేంపల్లి మండల కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారామ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వేంపల్లి కు చెందిన కడప పార్లమెంట్ నాయి బ్రాహ్మణ బీసీ సాధికారిక సభ్యుడు గండికోట వెంకటశివ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వేంపల్లిలో టీటీడీ పాలకమండలి సభ్యులు వైద్యం శాంతిరామ్ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఆయన మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతిరామ్ ను పాలకమండలి సభ్యులుగా
నియమించడం సంతోషం వ్యక్తం చేశారు.శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చట్ట సభల్లో అవకాశం కల్పించాలని కోరారు.