ప్రజావాణికి 164 దరఖాస్తుల రాక

*అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి:03. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి: సయ్యద్ సలీం పాషా… జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, 164 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 61, గృహ నిర్మాణ శాఖకు 25, జిల్లా పంచాయతీ కార్యాలయం, డీఆర్డీఓకు – 13 చొప్పున, సంక్షేమ శాఖకు – 09, ఉపాధి కల్పన శాఖకు – 08, ఎండీ సెస్ – 05, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ – 04 చొప్పున, ఎక్ష్సైజు శాఖ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు – మూడు చొప్పున, పౌర సరఫరాల శాఖ, విద్యా శాఖ, వైద్య శాఖ, ఆర్ అండ్ బీకి రెండు చొప్పున, జిల్లా వ్యవసాయ శాఖ, రవాణా శాఖ, డీఎం ఆర్టీసీ సిరిసిల్ల, శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఈఓ, నీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ కార్యాలయానికి – 01 చొప్పున వచ్చాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆయా శాఖల తదితరులు పాల్గొన్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *