సాక్షి డిజిటల్ న్యూస్.2/3/2026 హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మడికొండ పవన్ కుమార్ ఈరోజు ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ ఆధ్వర్యంలో కామ్రేడ్ రౌతు మనోహర్ జ్ఞాపకార్థంతో పరకాల పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో పరకాల ఎమ్మార్వో టి.విజయలక్ష్మి చేతుల మీదుగా 40 మంది విద్యార్థులకు ఎగ్జామ్స్ పాడ్స్ మరియు పెన్ బాక్స్ లు అందించారు అనంతరం ఎమ్మార్వో విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్ లో బాగా రాసి స్కూలుకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు అలాగే ఎగ్జామ్స్ రాసే ముందు విద్యార్థులు భయానికి గురి కాకుండా ధైర్యవంతంగా స్పష్టంగా రాయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ దామోదర్ గర్ల్స్ హై స్కూల్ ఇన్చార్జ్ పద్మజ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మండలాధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్ జిల్లా కమిటీ సభ్యుడు సాల్మన్ రాజ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
