సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 పెనగలూరు రిపోర్టర్ మధు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం లో గతంలో మంజూరైన ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలనీలను ఈరోజు హౌసింగ్ డి ఈ ఈ శ్రీరాములు రెడ్డి తనిఖీ చేయడం జరిగినది పెనగలూరు లే అవుట్ నందు లబ్ధిదారులతో గవర్నమెంట్ ఇచ్చిన తేదీకి ఉన్నటువంటి ఇన్ కంప్లీట్ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని మాట్లాడడం జరిగినది ఈయన వెంట హౌసింగ్ ఏఈ హరి ప్రసాద్ పంచాయతీ సెక్రెటరీ సురేష్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉషారాణి సుగుణను మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.