శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు 51,111 రూ విరాళం అందజేసిన శ్రీరాముల జ్ఞానేశ్వర్….

★రామభక్తి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి శ్రీరాముల జ్ఞానేశ్వర్….

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్, బోడుప్పల్ సర్కిల్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు 51, వేల 111 రూపాయలు విరాళం అందజేసిన బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంటెస్తెద్ కార్పొరేటర్ శ్రీరాముల జ్ఞానేశ్వర్ అనంతరం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ మన బోడుప్పల్ ప్రాంతం లో నిర్మాణం కోసం పవిత్ర కార్యం ప్రారంభించబడింది.ఈ మహాయజ్ఞంలో ప్రతి భక్తుని సహకారం ఎంతో విలువైనది.మీరు అందించే ప్రతి చిన్న విరాళం కూడా భగవంతుని సేవలో భాగమే.ఆలయ నిర్మాణానికి మీ వంతు సహకారం అందించి పుణ్యఫలం పొందగలరు అలాగే మన ప్రాంతంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం రానున్న రోజుల్లో భక్త జనాలతో విశేషమైన పేరు పొందుతుందని తెలిపారు.