పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన డివిజనల్ పంచాయతీ అధికారి

జనం న్యూస్ ఫిబ్రవరి 13 ఎలిగేడు మండలం : గురువారము రోజున మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎం పీ డి వో భాస్కర్ రావు ఆధ్వర్యములో మండలం పంచాయతీ కార్యదర్శులతో డివిజనల్ పంచాయతీ అధికారి దేవకీ దేవి సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారి చేసారు డిసిబి వసూళ్లు ,100% పన్ను వసూళ్లు చేయాలి. 15 వ ఆర్థిక సంఘం ,నిధులు ఖర్చు,వినియోగంపైసమీక్ష ట్రేడ్ లైసెన్స్ ల రిన్యూవల్ ప్రక్రియ వేగవంతం చేయాలి. గ్రామాల్లో పారిశుధ్య పనులు పర్యవేక్షణ ,సెగ్రిగ్రేషన్ షెడ్ షెడ్లను సమర్థవంతమైన నిర్వహణ.మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయుట ఈజీఎస్ కింద నర్సరీల నిర్వాహణ గతంలో జరిగిన జీపి ఇన్ స్పెక్షన్ రిమార్క్స్ ను పిస్ యాప్ లో వెంటనే పరిష్కరించాలి ,గ్రామ పంచాయతీ రికార్డులను పరిష్కరించాలి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగు నీరు ముందస్తు ప్రణాళికలు. తదితర అంశాలపై గ్రామ కార్యదర్శులకు తగు సూచనలు చేసారు.ఈ కార్యక్రమములో ఎం పి వో బేరి కిరణ్ ,శేషయ్య,సూరి ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *