జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 450 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు

*జిల్లా ఎస్ పి అశోక్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్ 13 ఫిబ్రవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, ఓట్ల లెక్కింపు సందర్భంగా రేపు 163 బి ఎన్ ఎస్ ఎస్ 144 సెక్షన్ అమలు విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధo
ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 450 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం అయిన ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కాలేజీ వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పరిశీలించారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 163 బి ఎన్ ఎస్ ఎస్ 144 సెక్షన్ అమలుఅమలు చేస్తున్నామని తెలిపారు. ఈ యొక్క 163 బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ రేపు ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు.ఈ సెక్షన్ అమలులో ఉన్నప్పుడు ధర్నాలు,రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం,సభలు,సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని వాటిని నిర్వహించ కూడదని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కాలేజీ పరిసర ప్రాంతాలను డాగ్స్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఓట్ల లెక్కింపునకు హాజరు అయే అభ్యర్థులు, ఏజెంట్లు, నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్,ఇంక్ బాటల్స్, పేలుడు కారణం అయే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు మరియు తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుంది అన్నారు.
ఈ యొక్క కార్యక్రమం లో డిఎస్పి లు రఘు చందర్,రాములు మరియు ఇన్స్పెక్టర్ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *