సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఎస్బిఐ మేనేజర్ గా నాలుగు మండలాల సంబంధించీన ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ బ్యాంకు సమస్య ఏది ఉన్న వెంటనే పరిష్కరిస్తూ ప్రజల్లో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న కాటారం ఎస్బిఐ మేనేజర్ జె. ప్రవీణ్ కుమార్ ప్రజల సేవలో బ్యాంకు క్రాప్ లోన్లు గాని పర్సనల్ లోన్ గాని హౌసింగ్ లోన్స్ గాని గోల్డ్ లోన్ గాని ముద్ర లోన్స్ గాని ఎడ్యుకేషన్ లోను గాని ఏవి ఉన్న తన ఛాంబార్ కు పిలిపించుకొని మీకు ఏం సమస్య ఉంది అని కస్టమర్ లను తెలుసుకొని వెంటనే వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించడం ఆయన గొప్పతనం ఈ విషయము కస్టమర్లు తెలుసుకుంటే సారు చాలా మంచివాడని మా మహిళా సంఘాల లోన్లు కూడా ఆపకుండా తొందరగా చేస్తారని ఎవరు వచ్చినా ఆయనకు కోపమనేది ఉండదని ఇలాంటి మేనేజర్ మాకు ఉండాలని కొందరు వ్యక్తులు ఆయన మీద కావాలని బురద జల్లుతున్నారు ఈ పద్ధతి మార్చుకోవాలని వారు కోరినారు నాలుగు మండలాల ప్రజలు ఆయన గురించి చాలా పొగుడుతున్నారు. ఇలాంటి మేనేజర్లు ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదని ఇలాంటి మేనేజర్ ను ట్రాన్స్ఫర్ చేయకుండా పొడిగించాలని నాలుగు మండలాల కస్టమర్లు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.