అంత్యక్రియలకు అడ్డుగా కుల రక్కసి

జనం న్యూస్ : జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కంధనకుంట గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది ఓ మనిషి చనిపోయినా కుల రక్కసి కట్టుబాట్లు అతని పాడె మోసెందుకు ఎవరిని రానీయకుండా చేశాయి వివరాల్లోకి వెళ్ళితే జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కంధనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశం నిన్న అనారోగ్యంతో మృతి చెందాడు .కుల బహిష్కరణ గురైన మృతుడి బంధువైన ఓ వ్యాక్తి అంత్యక్రియలకు హాజరయ్యారు.అతను వచ్చిన చోట వెళ్తే తాము కుల పెద్దల ఆగ్రహానికి గురవుతామనే భయంతో గ్రామస్తులే వారు అంత్యక్రియలకు రాలేదు ఆఖరి చూపు చుసేందుకు వచ్చిన కొందరు బందువులు సైతం ఊరి గొడవలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయేనన్న భయం తో పాడె మోయలేదని తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో మృతుడి భార్య ఆడపడుచులు మరో ఇద్దరు పురుషులు కలిసి పాడె మోసి అంత్యక్రియలు తంతు ను పూర్తి చేశారు శవయాత్ర లో మృతదేహాంపై మురుమురాలు చల్లవల్సిన బాధ్యతా ఓచీన్న బాలుడు తీసుకున దృశ్యం కలచి వెసింది