సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 రిపోర్టర్ సంజీవ్ అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ ద్వచక్ర వాహనం నడిపేవారు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించుకోవాలని అరుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి డుంబ్రిగూడ మండల కేంద్రంలో మూడు రోడ్ల జంక్షన్ వద్ద వాహన చోదకులకు రహదారి భద్రతపై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి అని డ్రైవింగ్ లైసెన్స్ రికార్డులు తమ వద్ద ఉంచుకొని నడపాలని సీఐ హిమగిరి తెలిపారు ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని 11 మంది వాహనదారులకు ఎండి మొబైల్ డివైస్ ద్వారా జరిమానా విధించినట్లు తెలిపారు అదనంగా గతంలో ఎం వి. చలానలు మొబైల్ వేకిల్ చలానాలు ఉన్న రెండు వాహనాలను యజమానులకు వాట్స్అప్ ద్వారా జరిమాణాలు కట్టించినట్టు వెల్లడించారు ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎస్సై సురేష్ రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చని ప్రతి ఒక్క వాహనం దారులు బాధ్యతయుతంగా వ్యవహరించాలని సి ఐ హిమగిరి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది వాహన చోదకులు పాల్గొన్నారు.