సాక్షి,డిజిటల్ న్యూస్, మరికల్, 4,2026,( రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రామ పెద్దచెరువులో అక్రమంగా నీటిని గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా మరికల్ మండల తహసీల్దార్ కి ఇలాంటి సమాచారం లేకుండా గ్రామ ప్రజల దాహర్తిని రైతుల సమస్యలను గుర్తించకుండా పెద్ద చెరువు నీటిని బయటకు విడుదల చేసినందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం నాడు మండల తహసీల్దార్ కి ఫిర్యాదు చేస్తూ ప్రభుత్వ కాలువ పక్కన ఉన్నటువంటి మొరంను ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రయివేట్ వ్యక్తులు. అక్రమంగా సంపాదిస్తున్నా వారిపై చర్యలు తీసుకోగలరని అఖిల పక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మరికల్ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లంబడి తిరుపతయ్య, వార్డు సభ్యుల సురిటి చంద్రశేఖర్, నాయకులు కస్పె శ్రీనివాసులు, బాలరాజ్ గౌడ్, స్వామి, వడ్డే శ్రీరామ్, బాలకృష్ణ, రవి గౌడ్ కృష్ణయ్య, రమేష్, మరికల్ గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.