సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4 2026 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్, కోదాడ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ బోణీ కొట్టింది.స్థానిక 31వ వార్డు నుండి కోదాడ మాజీ సర్పంచ్ యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు కాంగ్రెస్ పార్టీ పక్షాన నామినేషన్ వేశారు. గత మూడు రోజులుగా వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా మంగళ నామి నేషన్ ల ఉప సంహరణ లో కుసుమ బాబు పై పోటీలో ఉన్న వారు తమ నామినేషన్ ను ఉప సంహరించు కోవడం తో కుసుమ బాబు ఏక గ్రీవం గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఏక గ్రీవం కు సహకరించిన మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి లకు, పోటీ నుండి ఉప సంహరించుకున్న అభ్యర్థులకు స్థానిక నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తప్పకుండా వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానన్నారు. ఏక గ్రీవం గా ఎన్నికైన కుసుమ బాబు, మాజీ సర్పంచ్ యెర్నేని బాబులకు స్థానిక నాయకులు, కార్య కర్తలు అభినందనలు తెలిపారు.