ఘనంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం

శ్రీకాకుళం జిల్లా, సాక్షి డిజిటల్ న్యూస్, ఇచ్చాపురం మండలం, రిపోర్టర్ ధర్మవరపు తులసి రావు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు కె. సూర్యారావు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సభను ఉద్దేశించి ప్రధానో పాధ్యాయులు కె సూర్యారావు, మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదుకొని పాఠశాలకు,తల్లిదండ్రులు మంచి పేరు తీసుకొని రావాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో దాత వజ్రపు వెంకటేష్, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఆసి లత, కో ఆప్షన్ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *