బోడుప్పల్ సర్కిల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి,కరస్పాండెంట్ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

*77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు….

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 27/2026, మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్, గ్రేటర్ హైదరాబాద్ బోడుప్పల్ సర్కిల్ ఇంద్రనగర్ కాలనీ లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి కరస్పాండెంట్ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ప్రిన్సిపల్ విజయలక్ష్మి కరస్పాండెంట్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవం భాగంగా ఎందరో మహానీయులు ప్రాణ త్యాగాల వలన లభించిన ఒక గొప్ప పండుగని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని విద్యార్థులకు తెలిపారు అలాగే బోడుప్పల్ లో విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *