ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

★విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించాలి ★జనసేన పార్టీ నేత దాసరి రవిశంకర్

సాక్షి డిజిటల్ న్యూస్, వేంపల్లి, జనవరి :26( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు ) 77వ గణతంత్ర దినోత్సవాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పులివెందుల నియోజకవర్గ జనసేన పార్టీ నేత దాసరి రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దాసరి రవిశంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది అని,ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దేశభక్తి, కర్తవ్యబోధ పెంపొందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు విద్యార్థుల జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. అనంతరం జనసేన పార్టీ యువ నాయకుడు గోసల ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.