ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి…

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26, మహాదేవపూర్,(తులసి మహేష్) ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన జాతీయ గీతానికి వందనం సమర్పించి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. ​ఈ సందర్భంగా చల్ల రమేష్ రెడ్డి మాట్లాడుతూ ​ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగమే దిక్సూచి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే నేడు ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ లభిస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటూ, దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాన అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచి మేకల శంకరమ్మ, ఉప సర్పంచ్ చల్ల చిన్నన్న,మడక ప్రతాపరెడ్డి, చల్ల మహేష్ రెడ్డి, చల్ల శంకరి, తులసి మహేష్, ఎల్లంకి రవీందర్, చల్ల రాజిరెడ్డి, చల్ల మోహన్ రెడ్డి, చల్ల రమేష్ రెడ్డి, కోడేటి లక్ష్మారెడ్డి, ఓడేటి రాజిరెడ్డి, చల్ల మోహన్ రెడ్డి, బండం లచ్చయ్య, తుడిచర్ల దుర్గయ్య, ఓడేటి రవీందర్, దాసరి సాగర్, శేఖర్, కొత్తూరు లచ్చయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *