గార్లలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

సాక్షి డిజిటల్ న్యూస్ 27 జనవరి మహబూబాబాద్ జిల్లా గార్ల మండల రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గార్ల మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శారద ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మంగమ్మ పోలీస్ స్టేషన్ లో గార్ల ఎస్ఐ బి సాయికుమార్ గార్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్య సంస్థలలో ప్రభుత్వ కార్యాలయాలలో సంబంధిత అధికారులు బాధ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర వేడుకలు జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు పలు రాజకీయ పార్టీల నాయకులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *