ఐక్య సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 27 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఐక్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు అంకం రాజేశం, ప్రధాన కార్యదర్శి కొండూరి సురేష్ ఆధ్వర్యంలో 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఐక్య సంఘ సభ్యులు,ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఐక్య సంఘం కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.