సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 నల్గొండ జిల్లా చిట్యాల మండలం: మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్నారు, సోమవారం నాడు చిట్యాల మున్సిపాలిటి కి సంబంధించిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కులను అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడం ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి కనకదుర్గ ఆలయం చైర్మన్ పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు రఘు మా రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోకల దేవదాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జడల చిన్న ఆది మల్లయ్య పార్టీ మండల అధ్యక్షులు గణిత పార్టీ లక్ష్మీనరసింహ మహిళా సంఘాల నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.