మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలో కొడిమ్యాల మండల తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు, కొడిమ్యాల గ్రామ ఉపసర్పంచ్ గుర్రం నర్సయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం స్వీట్ల పంపిణి చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జెల కరుణాచారి, మండల బిసి సెల్ అధ్యక్షులు, కొడిమ్యాల గ్రామ 5 వ వార్డు మెంబర్ రాపర్తి నర్సింగారావు, మండల బిసి సెల్ ప్రధాన కార్యదర్శి దోపతి సత్యం, కొడిమ్యాల గ్రామ అధ్యక్షులు కట్టేకోల రాజేంద్రప్రసాద్, అభిమానులు అంకం జనార్దన్,గడ్డమీది గంగయ్య, కొండ అనిల్, వేములవాడ సతయ్య, వడ్లకొండ హన్మండ్లు, బోగ గణేష్, వేముల రవి,చెన్న దేవయ్య, సురేష్,సంపూనూరి ఆంజనేయులు, చిట్టిపెల్లి గణేష్, సతీష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *