శ్రీశైలం ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు ద్వారా 21 రోజులకు రూ.3 కోట్ల 72 లక్షల 50 వేల 251/- రూపాయల రాబడి

సాక్షి డిజిటల్ న్యూస్: నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. •ఇ హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈఓ శ్రీనివాసరావు డిప్యూటీ ఈవో ఆర్ రమణమ్మ తదితర పర్యవేక్షకులు. సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.3,72,50,251/-నగదు రాబడిగా లభించింది. కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 21 రోజులలో ( 22.12.2025 నుండి 11.01.2026 వరకు) సమర్పించడం జరిగింది.అలాగే ఈ హుండీలో 158 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు,11 కేజీల 460 గ్రాముల వెండి లభించాయి. అదే విధంగా 1570-యుఎస్ఏ డాలర్లు,180–యు.ఎ.ఇ దిర్హమ్స్,1- కువైట్ దినార్, 5-సౌదీరియాల్స్,17-సింగపూర్ డాలర్లు,10–కెనడా డాలర్లు, 65-ఇంగ్లాండు ఫౌండ్స్,11-మలేషియా రింగిట్స్, 12510-ఓమన్ బైసా, 50-ఆస్ట్రేలియా డాలర్లు, 8–ఈరోస్,5–ఐర్లాండ్,1500–మయన్మార్,10,000-ప్రాన్స్ ,50–ఫిలిప్పీన్‌, 2000–వియత్నామ్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు,ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.రమణ,చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, డిప్యూటీ కార్యనిర్వ హణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *