సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి అరుణ.. సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 164వ జయంతినీ పురస్కరించుకొని గురువారం పటాన్చెరు పట్టణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని కొనియాడారు. ఆయన పుట్టిన రోజును దేశ వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.