సాక్షి డిజిటల్ న్యూస్, షాద్నగర్, 12 జనవరి, 2026, రిపోర్టర్: కృష్ణ భారత యువత ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక విప్లవకారుడు స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) వేడుకలు ఫరూక్నగర్లో మిన్నంటాయి. ఈ సందర్భంగా పట్టణంలోని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వామివారికి ఘన నివాళులు అర్పించారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో కుంగ్ ఫు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఫరూక్నగర్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు, యువకులు వివేకానందుడి నినాదాలతో పరిసరాలను ఉత్తేజపరిచారు. యువతకు మార్గదర్శకం వివేకానందుడి బోధనలు
ఈ సందర్భంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు: స్వామి వివేకానందుడి ఆశయాలు యువతకు దిక్సూచి వంటివని, ఆయన బోధనలు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని కొనియాడారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, క్రమశిక్షణతో కూడిన విద్య, క్రీడలు యువతను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని తెలిపారు. చిన్నారులు చిన్నతనం నుంచే వివేకానందుడి వంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తెలుసుకోవాలని, వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు….
