సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 06, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ సంజయ్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ తండ్రి అంతటి రాయలింగు గౌడ్ ఇటీవల గుండెపోటుతో మరణించగా వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం విచ్చేసిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ అంతటి అన్నయ్య గౌడ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నయ్య గౌడ్ కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మార్కెట్ చైర్మన్ గజభీంకర్ జగన్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, చింతల రాజు, దున్నపోతుల రాజయ్య, దుగ్యాల సంతోష్, న్యాతరిదేవేందర్, గాదాసు రవీందర్, నోముల శ్రీనివాస్ రెడ్డి, సజ్జద్ తదితరులున్నారు.