మరిపెడ లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్ మరిపెడ కాంగ్రెస్ పార్టీ మరిపెడ మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం గౌరవనీయులు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అండ్ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారి ఆదేశాల ప్రకారం మరిపెడ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ ఆధ్వర్యంలోపట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్ అధ్యక్షతన జిల్లా పార్టీ నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ పెండ్లి రఘువీరా రెడ్డి ముఖ్య అతిథులుగా జరిగిన ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సుపరిపాలనతో కాంగ్రెస్ వేవ్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో 15 వార్డులు గెలవడం మనందరి ముందున్న పెద్ద లక్ష్యమని..ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేదించాలంటే పార్టీ శ్రేణులు బేధాభి ప్రాయాలు పక్కకు పెట్టి కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి గారు మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసి ఎమ్మెల్యే గారికి మరిపెడ మున్సిపాలిటీ విజయాన్ని బహుమతిగా అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాలం రవీందర్ రెడ్డి గంధసిరి అంబరీష కుడితి వెంకట్ రెడ్డి, పానుగోతు రాంలాల్,గుండగాని వెంకన్న వీసారపు శ్రీపాల్ రెడ్డి గుండ గాని వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *