జిల్లా కలెక్టరేట్ మరియు డిపిఓ కార్యాలయాలలో నూతన సంవత్సర వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ మంచిర్యాల జనవరి 3 /2026, జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంచిర్యాల బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారులు కలెక్టర్ మరియు డిపిఓ కార్యాలయా ల్లో అధికారులను కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శాలువా తో సత్కరించి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు అందరిని అభినందించి రాబోయే ఎన్నికలు కూడా ఇలానే నిబద్ధతతో నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారులు ధర్మారాణి సతీష్ మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపురావు అజ్మత్ సఫ్దర్ అలీ శ్రీనివాస్ సత్యనారాయణ అనిల్ కుమార్ విజయ్ ప్రసాద్ వెంకటేష్ మహేష్ డిపిఓ కార్యాలయ సిబ్బంది ప్రజ్ఞ వెంకటేష్ పంచాయతీ కార్యదర్శులు నరేందర్ శ్రవణ్ సుమన్ నాగరాజు మల్లేష్ వంశీకృష్ణ రాజశేఖర్ రాకేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.