రైతుల పట్ల సవితి ప్రేమను చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి

*తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు. k చలపతి

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా : రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి చవితి ప్రేమను చూపిస్తున్నట్లు కుప్పం నియోజకవర్గ రైతు సంఘ అధ్యక్షులు కే చలపతి పేర్కొన్నారు శుక్రవారం రామకుప్పంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకున్నట్టు చెప్పారు ముఖ్యంగా సబ్సిడీతో డ్రిప్ పరికరాలను అందించి వ్యవసాయాన్ని సులువు పద్ధతిగా మార్చినట్టు చెప్పారు అదేవిధంగా ఉద్యానవన పంటల్లో పూలు తోటలు కాయగూరలు తదితర పంటలు సాగుకు ప్రోత్సాహకాలు అన్ని ఇచ్చినట్లు చెప్పారు ముఖ్యంగా అన్నదాత సుఖీభవ గోకులం షెడ్లు నిర్మించినట్లు చెప్పారు ఉద్యానవన శాఖ ద్వారా గ్రీన్ హౌస్ ప్యాక్ హౌస్ లను నిర్మించేందుకు సబ్సిడీ అందించినట్లు తెలిపారు సబ్సిడీ ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు పశుగ్రాసం నాతోపాటు పాడి ఆవులు కొనుగోలుకు రుణాలను అందించినట్లు చెప్పారు అదే విధంగా సుమారు 800 కిలోమీటర్ల దూరం నుండి కోట్ల రూపాయల వ్యయం చేసి హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణానది జలాలను కుప్పానికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అందిస్తున్న సేవలకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు ప్రతిపక్ష నాయకులు రైతుల పోయిన సవితి ప్రేమను చూపిస్తూ వారిని గతంలో ఆదుకోక గాలికి వదిలేసినట్లు తెలిపారు రైతులకు నిజమైన ప్రభుత్వం తెలుగుదేశం అంటూ ఆయన పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *